పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తాజాగా ఇప్పుడు గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తూ ప్రకటించింది. దర్శకుడు పరశురామ్ పెట్ల, సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఈ పనిని పూర్తి చేయడంలో ఆమెకు సహకరించారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa