యువ కథానాయకుడు సందీప్ కిషన్, "సుబ్రహ్మణ్యపురం" చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారతంలో తన బొమ్మను గురువుగా భావించి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడి నుంచి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు ద్రోణాచార్యులు. ఈ ఆధునికకాలంలో అలాంటి ఒక గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగాడు అనే ఉత్సుకత రేకెత్తించే కధాంశంతో రూపొందించే ఈ చిత్రానికి నిర్మాత "కార్తికేయ' లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్.మిగిలిన నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేస్తారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa