by Suryaa Desk | Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధించిన అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయికల్ మండలంలోని ప్రభుత్వ భూములను కలెక్టర్ జగిత్యాల ఆర్డీఓతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, రాయికల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.