by Suryaa Desk | Fri, Oct 18, 2024, 02:46 PM
సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు.
విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.