ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు చెత్తంతా తీసేస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 09:03 PM

తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల ఘాటు వ్యాఖ్యలతో రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్.. మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఘాటు హెచ్చరికలు చేశారు.


 "చీప్ రేవంత్ రెడ్డి రేవంత్ నా మాటలు గుర్తు పెట్టుకో.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని మొత్తం తొలగిస్తాం. మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర గర్వాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచనతో పాటు నీ పెంపకం ఎలాంటది అన్నది తెలుపుతోంది. మీ మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ కేటీఆర్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డికి హెచ్చరికలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.


అయితే.. సచివాలయం మందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశంపై గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే విషయంపై సోమవారం రోజున కేటీఆర్ చేసిన వాఖ్యలకు కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. పాఠశాలల విద్యార్థుల ముందు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నాడని ఆరోపించారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


"అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు." అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa