మున్నేరు మిగిల్చిన కన్నీటితో అవస్థలు పడుతున్న ముంపు వాసులకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అండగా నిలుస్తున్నారు. దండి భాస్కర్ మెమోరియల్ ట్రస్ట్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జలగం నగర్ లో ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. దీనిని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ... ప్రజలకు నీటిని అందేలా చొరవ చూపారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడారు... వరదలతో ఇండ్లలోకి పెద్ద ఎత్తున బురద చేరిందని, నీరు లేకపోవడంతో తొలగించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అధికారులు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లేక చిమ్మ చీకట్లో భయానక పరిస్థితిలో ప్రజలు ఉంటున్నారని, విద్యుత్ శాఖ వారు సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ పాషా, అతని మేనల్లుడు డాక్టర్ నియాజ్ ఆధ్వర్యంలో దానవాయిగూడెం, రామన్నపేటలోని వరద బాధితులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు మొహమ్మద్ మహబూబ్ పాషా, బూర మనోజ్, షేక్ జాఫర్, బిక్కన్ ,సిపిఐ నాయకులు దొంతగాని రాజా గౌడ్ ,కాసాని రమేష్ ,మండవ చంద్ర గౌడ్ ,అన్వేష్ ,బోడపట్ల సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa