విపత్తులు వచ్చిన్నప్పుడు వరద బాధితులకు అండగా ఉండాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరైనది కాదని పాలేరు మాజీ శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సాయి గణేష్ నగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మున్నేరుకు వరద పోటెత్తడంతో మండల లోని కరుణగిరి, జలగం నగర్ నాయుడుపేట, కస్నాతండా, వాల్యా తండా, తీర్ధాల,రాజీవ్ గృహకల్ప, టీచర్ కాలనీ కేబీర్ నగర్ తదితర ప్రాంతాలలో ఇండ్లు జలమయం అయ్యాయని వారిని ఇంత వరకు ఆదుకున్నవారే నుకరువయ్యారని అన్నారు.
ఇండ్లలోకి వరద నీరు చేరి కట్టు బట్టలతో బయటకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా ముంచెత్తిన వరడతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ 50 వేలు ఆర్ధిక సహయం, నిత్యవసర సరుకులు అంద చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బి ఆర్ ఎస్ మండలాద్యక్షుడు బెల్లం వేణు, మాజీ జడ్పీటిసి యండపల్లి వరప్రసాద్, మాజీ సూడా డైరక్టర్ సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa