ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని, కర్షక్ బి.ఎడ్ కళాశాలలో "తలసేమియా రహిత తెలంగాణ" లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. కె రషీద్ గురువారం తలసేమియా అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది చిన్నారులు తలసేమియా వంటి జన్యు వ్యాధితో బాధపడుతున్నారన్నారు. భారతదేశంలో ప్రతి రోజూ కొత్తగా తలసేమియా గ్రస్త చిన్నారులు జన్మిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తలసేమియాను ముందస్తు పరీక్షల ద్వారా గుర్తించవచ్చని, వివాహానికి ముందు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చని డాక్టర్ బాలు హితవు పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా పనిచేసి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, తలసేమియా రహిత తెలంగాణ సాధించాలన్నారు.
ఈ విధంగా ప్రతి ఒక్కరి సహకారంతో తలసేమియా వ్యాధిని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, ఆ దిశగా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa