ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో సభాపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 08:00 PM

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో సభాపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మూడు నెలలలోపు స్పీకర్ చర్యలు తీసుకోవాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.స్పీకర్ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా ఆయా ఎమ్మెల్యేలను ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుందని తెలిపారు. ఆరేళ్ల వరకు కనీసం వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయడానికి వారు అనర్హులు అవుతారని వ్యాఖ్యానించారు. ఆరు నూరైనా ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నిర్ణయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీలోకి వెళ్లిన వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa