ట్రెండింగ్
Epaper    English    தமிழ்

26 కస్టర్డ్ గేట్ల ద్వారా నీటిని విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 10:36 AM

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వారం రోజులుగా 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4,16,324 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ప్రస్తుతం నీటి మట్టం 585 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9,019 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,518 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 26 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,63,714 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa