బంగారు కొనాలనుకొనే వారికి ఇది నిజంగా శుభవార్తే మరి. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్ బాండ్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. జనవరి 10 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రారంభం అవుతుంది. జనవరి 14 వరకు ఈ బంగారు బాండ్లను కొనుగోలు చేయొచ్చు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కేంద్ర ప్రభుత్వం తరుపున ఈ బంగారు బాండ్లను జారీ చేస్తుంది. అందువల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రిస్క్ లేకుండా హాయిగా మీరు బంగారు బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఒక గ్రాము బంగారం దగ్గరి నుంచి 4 కేజీల వరకు బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. రిజర్వు బ్యాంక్ గోల్డ్ బాండ్ల ధరలను నిర్ణయిస్తుంది. ఒక గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ.4786గా నిర్ణయించారు. అయితే ఆన్లైన్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 వరకు తగ్గింపు లభిస్తుంది. 10 గ్రాములు కొంటే రూ.500 తగ్గింపు వస్తుంది. జనవరి 18 నుంచి బాండ్లను జారీ చేస్తారు. గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి. ఇకపోతే బ్యాంకులు, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజీలు, ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో బంగారు బాండ్లను కొనుగోలు చేయొచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల్లో మాత్రం ఈ సదుపాయం లేదు. గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. గోల్డ్ బాండ్లు కొనడం వల్ల 6 రకాల ప్రయోజనాలు పొందొచ్చని ఎస్బీఐ పేర్కొంటోంది. 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. భద్రంగా దాచుకోవాలనే భయం అవసరం లేదు. ఎక్స్చేంజీల్లో గోల్డ్ బాండ్లు ట్రేడ్ అవుతాయి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు. జీఎస్టీ, తయారీ చార్జీలు ఉండవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa