ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. బుధవారం మంత్రివర్గ సమావేశానికి సమర్పించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వర్చువల్గా భేటీ అయిన మంత్రులు 26 జిల్లాలకు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఆ వివరాలు..
విశాఖపట్నం జిల్లా వివరాలు:
అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం: పాడేరు* రెవెన్యూ డివిజన్: పాడేరు
మండలాలు: అరకువ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు
విశాఖపట్నం జిల్లా
రెవెన్యూ డివిజన్: భీమునిపట్నం(కొత్తది)
మండలాలు: భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం గ్రామీణం, సీతమ్మధార
రెవెన్యూ డివిజన్: విశాఖపట్నం
మండలాలు: గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, మొలగాడ, మహారాణిపేట, పెందుర్తిఅనకాపల్లి
రెవెన్యూ డివిజన్: అనకాపల్లి
మండలాలు: దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చాయపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం
రెవెన్యూ డివిజన్: నర్సీపట్నం
మండలాలు: నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్.రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa