ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:58 PM

విశాఖ జిల్లా చోడవరం జ్యోతిబా పూలే బాలికల ఏపీ వెనుకబ డిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరి స్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ రత్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 28 విద్యాసంవత్సరానికి 5వ తరగ తిలో చేరాలనుకునే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ విద్యార్థినులు 2009 సెప్టెంబరు 1వ తేదీలోపు జన్మించిన వారు, బీసీ, ఈబీసీ కులాలకు చెందిన వారు 2011 సెప్టెంబరు 1నుంచి 2013 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa