ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న షాలినీ పాండే

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 14, 2018, 02:26 PM

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే హల్ చల్ చేసింది. ఒక టీవీ ఛానెల్ లో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా 'మేము సైతం' కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో షాలినీ పాండే పాల్గొంది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని సినీ నటులు ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు షాలినీ పాండే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో షాలినీ పాండే కేపీహెచ్బీలో కూరగాయలమ్మింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో ఫోటోలు దిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa