కరోనా బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో నాలుగు రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ సతీమణి, పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. శివశంకర్ మాస్టర్ భార్య హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
అయితే తాజాగా శివశంకర్ మాస్టర్ చికిత్స నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి ఉదారంగా స్పందించారు. రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. శివశంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ శివశంకర్ కు చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇటీవలే శివశంకర్ మాస్టర్ ఆచార్య సెట్స్ వద్దకు వచ్చారని, ఆయనతో మాట్లాడానని వెల్లడించారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, దేవుడు తప్పకుండా ఆయన కోలుకునేలా చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ స్పందిస్తూ, చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఈ కష్టసమయంలో చిరంజీవి అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని అన్నారు. చిరంజీవికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పారు. ఇక శివశంకర్ మాస్టర్ కుటుంబానికి తమిళ హీరో ధనుష్ కూడా సాయం చేసినట్టు తెలుస్తోంది. దేవుడు తప్పకుండా శివశంకర్ మాస్టర్ ని కోలుకునేలా చెయ్యాలని సినీ ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa