నాగ శేఖర్ దర్శకత్వంలో హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని చిత్రబృందం నుంచి అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. సత్యదేవ్, తమన్నాలతో పాటు మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa