ఒకప్పుడు మొదట విలన్ పాత్రల్లో మెప్పించి, ఆ తర్వాత హీరోలుగా మారి స్టార్ డమ్ అందుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ గతంలో మహేష్ 'నిజం'లో విలన్గా నటించాడు. అయితే మరోసారి ఈ కాంబినేషన్ రీపెట్ కానున్నది టాలీవుడ్ టాక్. మహేష్తో గోపీచంద్ తన పవర్ ఫుల్ విలనిజం చూపించనున్నాడని తెలుగు సినీ ఇండస్ట్రీ టాక్.
గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా మెప్పించాడు. అలాంటి గోపీచంద్ మళ్లీ పవర్ఫుల్ విలన్గా .. రాజమౌళి సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ గతంలో మహేష్ 'నిజం'లో విలన్గా నటించాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ మళ్లీ కలుస్తుందని అంటున్నారు. అయితే వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa