విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ట్రైలర్ను నిన్న మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ బుధవారం సాయంత్రం లాంచ్ చేయగా రియల్ టైమ్ వ్యూస్ 3.5 మిలియన్లను దాటింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో నంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. ఈ విషయాని మూవీ మేకర్స్ పోస్టర్ ద్వార అఫీషియల్ గా ట్విట్టర్ లో ఎనౌన్స్ చేసారు.ట్రైలర్ యూత్ఫుల్ మూమెంట్స్ మరియు కొన్ని ఫన్నీ వన్-లైనర్లతో నిండిపోయింది.డిజె టిల్లు ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్స్ "తిమ్మరుసు", "నాంది" చిత్రాలకు సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa