బీమ్లా నాయక్ పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో సినిమా రూపకర్తలు ఈ చిత్ర నిర్మాణంపై ఎంతో శ్రద్ద తీసుకొంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. తాజాగా మరో పాట పాడటానికి కైలాశ్ ఖేర్ ను తీసుకున్నారు. "మా సెన్సేషనల్ 'భీమ్లా నాయక్'లో మరో క్రేజీ ఎడిషన్ .. ఈ సినిమాలో ఒక పాటను పాడటానికిగాను కైలాశ్ ఖేర్ ను త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రిగారు రాశారు" అని చెబుతూ, ఆ సందర్భంలో దిగిన ఒక ఫొటోను తమన్ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఏదైనా సందర్భంలో ఒక పాట ఉంటే బాగుంటుందని భావించి కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని అనిపిస్తోంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈగో వార్. మరో కథానాయకుడిగా డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అనుకున్నారు. త్వరలోనే ఒక రిలీజ్ డేట్ ను ఖరారు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa