రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్కులో సినీ నటుడు అమిత్ తివారీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారీ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగమైనందుకు, ఈ ప్రపంచంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందరితో పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్ కు అమిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత తన స్నేహితులు కాలకేయ ప్రభాకర్, కిరీటి దామరాజు, రాఘవలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa