కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. హైదరాబాద్లో మేకర్స్ ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించగా ,నేషనల్ క్రష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ,డైరెక్టర్ నాకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు, షూటింగ్ అండ్ డబ్బింగ్ సెషన్లోనూ నవ్వుతూనే ఉన్నాను.ఆడియన్స్ కి కూడా ఈ మూవీ చాల బాగా నచ్చుతుంది అని చెప్పారు.అంతే కాకుండా ఈ మూవీ తనకు నచ్చిన సినిమాలలో ఒకటిగా ఉంటుందని తెలిపారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa