ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య మరియు పూజా హెగ్డే ఎవరికి వారు తమ ఆసక్తికరమైన ప్రాజెక్ట్లను చేస్తున్నారు. అప్పటి వరకు వీరిద్దరి కాంబోలో ‘ఒక లైలా కోసం’ ఫీల్ గుడ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ క్రేజీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లేటెస్ట్ తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ 'మనడు'. తమిళంలో శింబు, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. వీరి పేర్లను ఖరారు చేశారు. మరి ఈ డీల్ పై అధికారిక క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa