సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి "భీమ్లా నాయక్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ఉన్న హైప్ ఇప్పుడు లేదు. సమయం మించిపోవడంతో సినిమా ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ బహుశా ఈరోజు రావచ్చని టఫ్ టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై మరిన్ని భారీ అంచనాలు నెలకొనడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మరి నిర్మాతలు ముందుగా ట్రైలర్ని విడుదల చేస్తారా లేక ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున విడుదల చేస్తారా అనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa