టాలెంటెడ్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి "మత్తు వదలారా"సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ మూవీ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో " దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రోజు ఉదయం ఈ సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తుంది . సముద్రఖని ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa