ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునీత్ రాజ్ చివరి సినిమా...మార్చి 17న భారీ ఎత్తున్న రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 03:26 PM

దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు ఓ శుభవార్త. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన యాక్షన్ సినిమా ‘జేమ్స్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రాజ్ కుమార్ జయంతి అయిన మార్చి 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై విడుదల చేయనున్నారు.  ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. దీని ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు కూడా తల్లిదండ్రుల సమక్షంలో చూడొచ్చు. యాక్షన్ సినిమా కనుక ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ (46) గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లలో జేమ్స్ ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, పత్తికొండ కిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa