పనిభారంతో ఎవరికి న్యాయం లేని పరిస్థితుల్లో మనం దేనికి న్యాయం చేస్తామో దానికే కట్టుబడి పనిచేయాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తీసుకున్న ఓ డీసీజన్ ప్రస్తుతం బీటౌన్లో హాట్ టాపిక్ అయింది. నటనతో పాటు సినిమా నిర్మాణాల్లో భాగమవుతున్న ఈ బ్యూటీ.. తాజాగా తన నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆ బ్యానర్ కోసం పనిచేయనని, తన సమయాన్ని మొత్తం ఓ తల్లిగా గడుపుతూ, నటనకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. తన సోదరుడు కర్నేష్తో 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' అనే బ్యానర్ స్థాపించింది అనుష్క శర్మ. ఈ బ్యానర్పై పలు సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మించారు. అనుష్క పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఓ వైపు నటనలో భాగమవుతూనే ఈ నిర్మాణ సంస్థ కోసం పని చేసింది. సినిమా నిర్మాణాల్లో కూడా తన మార్క్ చూపించింది. ఈ బ్యానర్ వల్ల అనుష్క నష్టపోయింది లేదు. పైగా ఈ తరం జెనరేషన్ కోరుకునే విధంగా భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించే స్కోప్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో అనుష్క ఇలాంటి ప్రకటన చేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ''మా నిర్మాణ సంస్థ 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' జర్నీ ఓ సారి గుర్తు చేసుకుంటే మేము తీసుకు వచ్చిన సినిమాల విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నాం. ఈ బ్యానర్పై వచ్చిన సినిమాల విజయాల పట్ల గర్వంగా ఉంది. ఇకపై నేను నటిగా, ఓ తల్లిగా నా పూర్తి సమయాన్ని గడపాలనుకుంటున్నా. నాకున్న ఈ సమయాన్ని నా ఫస్ట్ లవ్, నటనకు అంకితం ఇస్తున్నాను. కొత్త రంగంలో కొత్త జీవితంలో అడుగు పెట్టే ఆలోచనతో నిర్మాణ సంస్థ నుండి వైదొలిగాలనే నిర్ణయం తీసుకున్నా'' అని అనుష్క శర్మ తన పోస్టులో రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే అనుష్క శర్మ మళ్లీ నటనపై పూర్తి దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. విరాట్తో పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేసిన ఆమె.. రెండేళ్ల క్రితం పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కెమెరాకు కాస్త దూరంగా ఉంటున్న అనుష్క.. ఇప్పుడు తన బిడ్డ కాస్త పెద్దది కావడంతో తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa