MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా టీజర్ ని నితిన్ పుట్టినరోజున అంటే మార్చి 30,2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అదే విషయాన్ని ప్రకటించడానికి మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు.నితిన్ సరసన ఈ సినిమాలో కృతిశెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్తో పక్కామాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa