కాశ్మీర్ ఫైల్స్ మరో మైలురాయిని దాటింది. వివేక్ అగ్నిహోత్రి యొక్క ది కాశ్మీర్ ఫైల్స్ ఒక రకమైన సంచలనం సృష్టించిన ఒక చిత్రం. విడుదలైన మొదటి రోజు నుండే ఈ సినిమా అటు మీడియాలోనూ, ఇటు ట్రేడ్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతోంది. కాశ్మీరీ పండిట్ల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 234 కోట్ల మార్క్ను దాటింది, ఇది అద్భుతమైన ఫీట్ అని చెప్పాలి.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదల కావడంతో కలెక్షన్స్ పై కాస్త ప్రభావం పడింది అని తెలుస్తోంది. ఈ చిత్రం ఆదివారం నాడు 3.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రాబడుతున్న వసూళ్లతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్కును ఈజీగా టచ్ చేయడం ఖాయం అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa