![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:41 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ తహశీల్ధార్ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డిఎండి తాహెర్ ఆధ్వర్యంలో తహశీల్ధార్ జ్యోతి మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తహశీల్ధార్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని.. ఆపదలో ఉన్న సాటి వ్యక్తుల ప్రాణాలను కాపాడండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ వెంకటయ్య, మీసేవ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.