![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 08:26 PM
ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతులను తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు చెందిన బియ్యాన్ని కాకినాడకు తరలించి, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్కు రవాణా చేస్తున్నారు. తాజాగా ట్రంగ్ ఎన్ నౌక ద్వారా 12,500 టన్నుల ఎంటీయూ-1010 రకం బియ్యాన్ని ఎగుమతి చేశారు.మొత్తం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంటీయూ-1010 దొడ్డు రకం బియ్యం కాగా, ఈ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ గత ఏడాది కోరింది.