ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కసితోనే పని చేస్తున్నా.. బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 07:24 PM

తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విగ్రహాల లొల్లితో ప్రజలకు ఒరిగేదేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలు, రుణమాఫీపై చర్చను దారి మళ్లించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. రుణమాఫీ అంతా భోగస్‌ అని.. 70 శాతం రైతులకు డబ్బులు రాలేదని చెప్పుకొచ్చారు. ఎంత మంది రైతులు రుణం తీసుకున్నారు? ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు? ప్రభుత్వం ఎంత మాఫీ చేసిందో గణంకాలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప అబద్దాలతో రైతులను మోసం చేయొద్దని.. నిజంగానే రుణమాఫీ చేస్తే రైతులు రొడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.


"రైతులకు భరోసా రాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇవ్వలే. మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 లు ఇవ్వలేదు. ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చర్చను దారి మళ్లించేందుకు రాజీవ్ విగ్రహాంపై సవాళ్లు, ప్రతివాళ్లు విసరుకుంటున్నరు. ఇప్పుడు చర్చ జరగాల్సింది విగ్రహాల గురించి కాదు... 6 గ్యారంటీలపైనే చర్చ జరగాలి. వీటిపై దారి మళ్లిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పుట్టగతులుండవు." అంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టరేట్‌కు వచ్చిన బండి సంజయ్‌కు కలెక్టర్ పమేలా సత్పతిసహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. వివిధ శాఖధిపతులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న భాగస్వామ్యం, నిధులు వివరాలతో పాటు కేంద్ర పథకాల అమలు తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.


"కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నా. నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు పూర్తి స్తాయిలో మేలు చేయడమే నా లక్ష్యం. అందుకోసం నేను కసితో పనిచేస్తున్నా. మీ శాఖ తరపున కేంద్రం నుండి కరీంనగర్ కు ఏ ప్రాజెక్టు తీసుకురావచ్చు. ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలపై కచ్చితంగా ప్రతిపాదనలు రూపొందించండి. కేంద్రంలోని ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. దయచేసి మీరంతా సహకరించండి." అంటూ.. అధికారులతో బండి సంజయ్ కోరారు.


"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రెండు కళ్లులాంటివి. రాష్ట్ర ప్రథకాలే కాదు.. కేంద్ర పథకాల అమలుపైనా ప్రధానంగా పోకస్ పెట్టండి. అప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే కసితో పనిచేస్తున్నా. మీ మీ శాఖల తరపున ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది? ఏ ప్రాజెక్టు తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుందనే వివరాలపై ప్రణాళికలు రూపొందించండి. వాటిని కేంద్రంలోని ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొస్తా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా. దయచేసి మీరంతా పూర్తిగా సహకరించాలని కోరుతున్నా." అని బండి సంజయ్ పేర్కొన్నారు.


"నావల్ల మీకు ఏ ఇబ్బంది రానివ్వను. కేంద్ర పథకాలను పూర్తిస్థాయిలో అర్హులకే అందించేలా చూడండి. ఈ విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటా. మీపై ఒత్తిళ్లు రాకుండా నేను కాపాడుకుంటా. దయచేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు పూర్తిగా సహకరించండి. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందకు ప్రయత్నిస్తా," అని బండి సంజయ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa