ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాసబ్ ట్యాంకు సమీపంలో గుడి ముందు మాంసం,,,,డస్ట్‌బిన్ నుంచి తీసుకొచ్చిన కుక్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:11 PM

హైదరాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో ఓ ఆలయం ముందు రోడ్డుపై ఓ జంతు మాంసం ముక్క పడి ఉన్న ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఆలయం ముందు ఓ పెద్ద సైజు మాంసం ముక్క కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా కావాలనే ఇలా పడేశారా? కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అక్కడ ఉన్న సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లను పరిశీలించారు. మాంసం ముక్క అక్కడకు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనేది అందులో స్పష్టంగా తెలిసింది.


రోడ్డు పక్కన ఉన్న ఉన్న మున్సిపాల్టీ చెత్త బుట్టలో ఉన్న మాంసం ముక్కను ఓ వీధి కుక్క.. తన నోటకరిచి పట్టుకుని వెళ్తోంది. ఈ క్రమంలో ఆలయం ముందుకు వచ్చేసరికి కొంత భాగం ఆకస్మాతుగా దాని నోటి నుంచి జారి రోడ్డుపై పడింది. ఈ దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. మాంసం ముక్క పడిపోయిన విషయం గమనించని ఆ శునకం ముందుకెళ్లిపోయిందని పోలీసులు తెలిసారు. దీనిపై ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసత్య ప్రచారాలు, కల్పిత కథనాలను చేయవద్దని హైదరాబాద్ నగర పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కాగా, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీని అయితే, ఈ ఘటనలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడ్ని నాగర్‌కర్నూల్‌కు చెందిన కృష్ణయ్య గౌడ్ అనే వ్యక్తిగా గుర్తించారు. దుర్గామాత విగ్రహాన్ని అతడు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో మతపరమైన వివాదాలేవీ లేవని డీసీపీ అక్షాంత్ యాదవ్ స్పష్టం చేశారు ఇటువంటి తరుణంలో గుడి మందు మాంసం ముక్క ప్రత్యక్షం కావడంతో ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికే ఇలా చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, సీసీటీవీ ఫుటేజ్‌లో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


నాంపల్లి దుర్గామాత విగ్రహ ధ్వంసం ఘటన గురించి సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తోన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మండపం నిర్వాహకులపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏటా దసరా సమయంలో నాంపల్లిలో ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఈసారి కూడా ఎగ్జిబిషన్ మైదానంలో దేవీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని అక్టోబర్ 11న ధ్వంసం చేశారు. ఈ ఘటన సున్నితమైనది కావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.


తనకు ఆకలి వేయడంతో ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని అమ్మవారి మండపం వద్దకు వచ్చి చూశాడు. అక్కడ ప్రసాదం గానీ, ఎలాంటి ఆహారం గానీ లభించకపోవడంతో మండపాన్ని చిందరవందర చేశాడు. విగ్రహాన్ని ధ్వంసం చేశాడని డీసీపీ అక్షాంత్ యాదవ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa