తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు తీపికబురు చెప్పారు. రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణక్ష్ంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని.. అదనపు ఆదాయం వస్తుందన్నారు. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోలార్ పంపు సెట్లపై కీలక ప్రకటన చేశారు.
తెలంగాణవ్యాప్తంగా త్వరలో రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క. రైతులకు కరెంట్ ఖర్చు ఉండదని.. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేస్తే రైతులకు అదనపు ఆదాయం కూడా వస్తుంది అన్నారు. పంటతోపాటు విద్యుత్పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టును తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతామని తెలిపారు. న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నారు.
విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు విక్రమార్క. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విజయదశమి.. రాష్ట్ర ప్రజలు మరిన్ని విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.
తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేయడం దారుణమని.. తాము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అలాగే రైతులకు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని.. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa