రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఎస్.ఎస్.టి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పురుమండ్ల వెంకట్ రెడ్డికి చెందిన టీఎస్ 09 ఈఆర్ 7367 నెంబర్ గల వాహనంలో అనుమానాస్పదంగా రూ. 4 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన విధానాల ప్రకారం ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు, పూర్తి వివరాల కోసం విచారణ చేస్తున్నట్లు పట్టణ సీఐ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa