న్యూఢిల్లీ : సాంప్రదాయ ఉద్యోగాల స్థానంలో టెక్నాలజీ ఉద్యోగాలు ఈ ఏడాది రాజ్యమేలాయి. 2018లో ఎంట్రీ లెవల్ లో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. వేతనాల పెంపు సగటున 8-10 శాతంగా ఉంది. 2018లో నియామకాల్లో ఉన్న జోరు... కొత్త ఏడాదిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు, హైరింగ్ మేనేజర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు కూడా గత ఏడాది స్థాయిలో ఉం టుందని అంచనా వేస్తున్నారు. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో నియామకాల విషయంలో యాజమాన్యాలు ఆచితూచి అడుగేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా అనిశ్చితి నెలకొనవచ్చని భావిస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులంటున్నారు. గడచిన కొన్నేళ్లుగా రాజకీయపక్షాలన్నీ ఉద్యోగాల కల్పన తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు మందుకుసాగాయి. సాంప్రదాయిక ఉద్యోగాల స్థానంలో టెక్నాలజీ ఉద్యోగాలు గణనీయంగా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో సాగుతుండటంతో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావటంతో జాబ్ మార్కెట్ కళకళలాడుతూ వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa