ఏం వస్తువులు కొందామన్న గుండె పోటు వచ్చేలా నిత్యవసర వస్తువుల ధరలు నెలకొన్నాయి. ఇంక వంట నూనేల విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిన్నమొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న వంటనూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు శుభవార్త అని చెప్పాలి. విపరీతంగా పెరిగిపోయిన ధరలతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ బాధ పడుతున్న సామాన్య ప్రజలకు, మహిళలకు వంటనూనెల ధరలు తగ్గటం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ప్రముఖ వంటనూనెల కంపెనీలు వినియోగదారులకు ఊరట నిచ్చే నిర్ణయాన్ని తీసుకోవడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంటనూనెల కంపెనీలు ఎమ్మార్పీ పై దాదాపు 10 నుండి 15 శాతం మేర ధరలను తగ్గించాయి. ఇది సామాన్యులకు పూర్తిగా కాకపోయిన కాస్త ఊరాట నిచ్చే అంశమే.
నిత్యావసర వస్తువుల ధరల విషయంలో సామాన్యులకు వంటనూనెల ధరలు తగ్గింపుతో కాస్త ఊరట లభించింది. వంటనూనెల ధరలను ఎమ్మార్పీ పై 10 నుండి 15 శాతం తగ్గిస్తున్నట్లు గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో కిలో వంట నూనె ధర 180 రూపాయల నుండి 200 రూపాయల వరకూ పెరగగా ఆ తర్వాత క్రమంగా తగ్గి 145- 150 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ మరోమారు వంటనూనెల కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో ధరలు బాగా తగ్గాయి. వినియోగదారులకు ఊరట నిచ్చే విధంగా పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇలా తమ నూనెల ధరలను తగ్గించిన ప్రము కంపెనీల గురించి ఓ సారి తెలుసుకొందాం వంటనూనెల ధరలు తగ్గించిన బ్రాండెడ్ కంపెనీల వివరాలను చూస్తే ఫార్చ్యూన్ , రుచి సోయా, రుచి గోల్డ్, న్యూట్రేల్లా, మహాకోష్, ఇమామి, బంగే, ఫ్రీడమ్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేసే అదాని విల్మార్, జెమిని, ఇమామి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవి మాత్రమే కాక న్యూట్రి లీవ్ బ్రాండ్స్, సన్నీ బ్రాండ్స్, గోకుల్ ఆగ్రో, జైకా బ్రాండ్స్, విటా లైఫ్, మెహక్ ధరలు కూడా ఎం ఆర్ పి పై 10 నుండి 15 శాతం వరకు తగ్గనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa