కొత్త సంవత్సరం వస్తోంది. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎన్నో మారుతుంటాయి. వీటన్నింటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి మీ బడ్జెట్పైనా ఇంపాక్ట్ చూయిస్తాయని చెప్పొచ్చు. దానికి తగ్గట్లుగా డబ్బు గురించిన ప్రణాళికలు చేసుకోవచ్చు. వీటిల్లో కొన్నింటిలో రూల్స్ మారితే.. కొన్నింటిలో కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు.. ఫిక్స్డ్ డిపాజిట్ల మార్గదర్శకాలు, యూపీఐ ట్రాన్సాక్షన్లు, టాక్స్ రిలేటెడ్ ఛేంజెస్, ఇతర అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం.
యూపీఐ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక అప్డేట్లు అందించింది. యూపీఐ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచింది. యూపీఐ 123పే అంటే ఫీచర్ ఫోన్లలో (స్మార్ట్ ఫోన్లు కానివి) యూపీఐ సర్వీసులు అందిస్తుంది. అంటే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. ఇది 2025, జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది.
లాంజ్ యాక్సెస్..
రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లకు మార్గదర్శకాల్ని సవరించింది ఎన్పీసీఐ. ఇది కూడా 2025, జనవరి 1 నుంచే అమలవుతుంది. టైర్డ్ స్పెండింగ్ క్రైటీరియాను (ఖర్చు చేసే దానిని బట్టి) రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు.. కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందొచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్లు..
హోమ్ ఫైనాన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు.. ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మార్గదర్శకాల్ని సవరించింది. పబ్లిక్ డిపాజిట్లు స్వీకరించేటప్పుడు, నామినేషన్స్, తిరిగి చెల్లించే సమయంలో కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ..
పీఎఫ్ విత్డ్రాకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల కీలక ప్రకటన చేసింది. త్వరలో ఏటీఎంల నుంచే నేరుగా పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే సదుపాయం తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దవ్రా చెప్పారు. ఐటీ వ్యవస్థను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇది అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ఇన్కంటాక్స్..
2024 బడ్జెట్ సమయంలో ప్రకటించిన ఇన్కంటాక్స్ రూల్స్.. అన్నీ ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే అమల్లోకి వచ్చాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025 జులైలో ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పన్ను మినహాయింపులు, తగ్గింపుల కోసం.. ఈ టాక్స్ రూల్స్ కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పొచ్చు. అందుకే వీటి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెరగ్గా.. మరోవైపు టాక్స్ శ్లాబుల్ని కేంద్రం మరింత సరళీకృతం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa