టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 60వ జన్మదినం సందర్భంగా అవయవదానం చేయబోతున్నట్లు ప్రకటించాడు. శుక్రవారం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో అవయవదాన సదస్సుకు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ మనం మనుషులుగా పుట్టాం. మనుషులుగా చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఏమి మిగలదు అని అయన అన్నారు.ఈ అవయవ దానం ద్వారా మనం చనిపోయినా మరో 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు అని అయన తెలిపారు.అవయవదానం చేసిన వారికి కూడా పద్మశ్రీ ఇవ్వాలి అని అయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa