![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 07:33 PM
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలం. తమ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం’ అని చెప్పారు.నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు 202.55 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రెండు లక్షల లోపు వరకు రైతు రుణమాఫీ చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిర్మల్ నియోజకవర్గానికి 202 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. దీని మీద చర్చ చేయడానికి నిర్మల్ కి సిద్ధంగా ఉన్నాం అని పొన్నం పేర్కొన్నారు.