|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 09:23 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదని అది ప్రజలు ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని వ్యక్తిగత లబ్ధికి వాడుకోవడం దారుణమని అన్నారు. మరోవైపు, ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్ నిజమైన జాతిపిత అని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత అని కొనియాడారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అని ప్రశ్నించారు. వేరే వాళ్ల ఫోన్లు దొంగచాటుగా వినేవాళ్లు జాతిపితలా అని ప్రశ్నించారు.