by Suryaa Desk | Fri, Oct 18, 2024, 09:31 PM
బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చింతలమానేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది... గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రామటెంకి శంకర్(45) గురువారం తన భార్య కుమారుని జైపూర్ హాస్టల్లో తీసుకెళ్తున్నరూ.ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణంలో భాగంగా ఆధార్ కార్డు ఇంట్లోనే మతిమార్చిపోవడంతో ఆధార్ కార్డు కోసం భర్తకు చరవాణి ద్వారా సమాచారం అందించారు.
ఆధార్ కార్డు భర్త శంకర్ బైక్ పై తీసుకొస్తున్న క్రమంలో ఒక గుంతల బైక్ అదుపుతప్పి ఛాతీ పై బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.