|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 04:04 PM
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దీనిని రాహుల్ గాంధీ ఇదివరకే ఆధారాలతో సహా నిరూపించారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ భావించారని, కానీ అక్కడ బీజేపీ గెలుపొందిందని గుర్తు చేశారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.ఇతర రాష్ట్రాలలోని వ్యక్తులను సైతం ఓటర్లుగా చేర్చినట్లు తెలిపారు. బీహార్లో తమకు బలం లేని చోట బీజేపీ ఓట్లను తొలగించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఈసీని ప్రశ్నించారని, కానీ ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు. ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ జరిగిందని అన్నారు.