![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 12:04 PM
దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులలో మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావారణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నిజామాబాద్ లో 40.1 కనిష్టంగా నల్లగొండ,హనుమకొండ లలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న బుధవారం తెలంగాణ లోని ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్..39.3, నిజామాబాద్..39, భద్రాచలం..38.4, మెదక్..37.6, మహబూబ్ నగర్..37.5, ఖమ్మం..37, హనుమకొండ..36.5, రామగుండం..36, హైదరాబాద్..35.6, నల్లగొండ..35, డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.