![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 12:21 PM
హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పదో తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. పేపర్ లీక్ ఘటనలో ఝాన్సీ లక్ష్మిని బాధ్యురాలిని చేస్తూ డిబార్ చేసిన విద్యాశాఖ అధికారులు. తన డిబార్ ను రద్దుచేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన విద్యార్ధిని. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ DEO, MEO, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ ప్రతివాదులుగా పేర్కొన్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ. అధికారులు, ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేసారంటూ పిటీషన్ లో పేర్కొన్న విద్యార్ధిని ఝాన్సీ లక్ష్మి