![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:00 PM
హైదరాబాద్లోని కర్మన్ ఘూట్ లో ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు.వెంకటేశ్వర్లును కత్తితో నరికి చంపాడు పవన్ అనే యువకుడు. వెంటనే వెంకటేశ్వర్లును ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు పవన్ కోసం గాలింపులు చేపట్టారు. నిందితుడి తల్లితో వెంకటేశ్వర్లుకు అక్రమ సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. దీనిపై వెంకటేశ్వర్లుతో పవన్ గత రాత్రి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అతన్ని కత్తితో నరికి చంపి పరారయ్యాడు.