|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 10:10 PM
హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు ప్రయాణిస్తుండగా టైర్ల కింద నుంచి పొగలు దట్టంగా వ్యాపించాయి. బస్సు ఓవర్ హీట్ కావడంతోనే పొగలు వస్తున్నట్లు గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపైనే నిలిపేశాడు.అయితే, బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులను రోడ్డుపైనే వదిలేసింది వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం. ప్రయాణికులను కనీసం పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర చలిలో రోడ్డుపైనే పడిగాపులు కాస్తూ నిలబడాల్సి వచ్చింది.ఈ సంఘటనతో పాటు, కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ దుర్ఘటనలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై, మొత్తం 20 మంది మృత్యువాత పడ్డారు. బస్సులోని 19 మంది ప్రయాణికులతో పాటు ఒక బైకర్ సైతం మరణించారు.