by Suryaa Desk | Fri, Oct 11, 2024, 04:21 PM
నాగచైతన్య, సమంత, నాగార్జునపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి సురేఖను తప్పిస్తారని ప్రచారం సాగుతోందని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. కాబట్టి ఈ ఇష్యూ ఆ రోజే క్లోజ్ అయిందన్నారు.గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ అంశంపై అధిష్ఠానం కూడా సురేఖ నుంచి వివరణ కోరలేదన్నారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కావాలని మాట్లాడలేదన్నారు. కేటీఆర్ కారణంగానే సురేఖ అలాంటి మాటలు మాట్లాడవలసి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు.ఈ అంశంలో నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం కోర్టు ఏం చెబుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.