by Suryaa Desk | Fri, Oct 11, 2024, 04:22 PM
కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్పై మజ్లిస్ దాడి ఘటనపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మజ్లిస్తో స్నేహం వేరు, శాంతిభద్రతలు వేరు అన్నారు. ఈ దాడి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. దాడుల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.దీపావళి లోపు రెండో విడత కార్పోరేషన్ పదవులు కేటాయిస్తామన్నారు. భవిష్యత్తు తరాల కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ అభివృద్ధికి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అలా అని తాము ఎక్కడా ప్రకటన చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో వందేళ్ల దోపిడీ జరిగిందని విమర్శించారు.