|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 08:18 PM
హైదరాబాద్ నగర మేయర్ గా పని చేసి ఆయన ముందుచూపుతో చేసిన నగర మాస్టర్ ప్లాన్ చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా ముదిరాజ్ మహాసభ సంఘం ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయిన నేత స్వర్గీయ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.కొరవి కృష్ణస్వామి వర్ధంతి పురస్కరించుకొని చిట్కుల్లోని ఆయన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నీలo మధు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల ముద్దుబిడ్డ మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అని ఆయన ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆయన బహుజనుల పక్షాన ఉండి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి వారి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత ఆశయాలను ఆయన స్ఫూర్తితో మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.