|
|
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 11:11 AM
ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. ఓ వైపు భూ భారతి బిల్లు పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతుండగా..బీఆర్ఎస్ సభ్యులు ఫార్ములా ఈ-కారు రేసు అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో వారంతా పేపర్లు చించి స్పీకర్ వైపు గాల్లో ఎగురవేస్తూ.. ప్లకార్టులతో వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను అవమానించారంటూ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. దళితుడైనా స్పీకర్ మీద పేపర్లు విసిరి అగౌరవపరిచారంటూ ఫైర్ అయ్యారు. సభలో అగౌరవంగా ప్రవర్తించింనందకు గాను బీఆర్ఎస్ (BRS) సభ్యులను సస్పెండ్ చేయాలని అన్నారు.